తెలంగాణ రైతు సంఘం నిర్మల్ జిల్లా 4 వ మహాసభను జయప్రదం చేయండి.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:తెలంగాణ రైతు సంఘం నిర్మల్ జిల్లా 4 వ మహాసభలు ఆగస్టు 13 తేదీ నాడు కడెం మండల కేంద్రంలో నిర్వహించనున్నాము. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శోభన్ హాజరవుతున్నారు. రైతులు నాయకులు కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నాం నిర్మల్ జిల్లాలో పోడు రైతుల సమస్యలపై రైతులకు గిట్టుబాటు ధరలకై రైతు సంఘం పోరాడింది.నరేంద్ర మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నది. ఈరోజు బైంసాలో తెలంగాణ రైతు సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఇప్ప లక్ష్మణ్, జిల్లా నాయకులు చింతకుంట శంకర్, నాగుల నరస గౌడ్, బుల్లోళ్ల ప్రసాద్ లు పాల్గొన్నారు.