ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
కాశిరెడ్డి గూడ సర్పంచ్ రామలింగం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 18 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం కాశిరెడ్డి గూడ గ్రామంలో ప్రజా పాలన దినోత్సవాన్ని కాశిరెడ్డి గుడా సర్పంచ్ రామలింగం గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణకు నిజమైన స్వాతంత్రం సెప్టెంబర్ 17న వచ్చింద ని అంతకు ముందున్న నిజాం రాజులు ప్రజల్ని ఎంతో దోచుకున్నారని ఆపరేషన్ పోలో ద్వారా అప్పటి కేంద్రా హోం మంత్రి అయినా సర్దార్ వల్లభాయ్ పటేల్ దొరవతో మనకు సెప్టెంబర్ 15న అఖండ భారత దేశంలో విలీనం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు గ్రామపంచాయతీ సెక్రటరీ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.