భవిత కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దాట్ల
పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి
ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు చెయ్యేరులోని భవిత సెంటర్ ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవిత సెంటర్ లో పిల్లకు నేర్పించే యాక్టివిటీస్ వివరాలును ఉపాధ్యాయిని స్వర్ణలత ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా హియరింగ్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ స్పీచ్ నేర్చుకునే విధానం అడిగి తెలుసుకున్నారు .అదే విధంగా టీడీపీ సీనియర్ నాయకులు నడింపల్లి సుబ్బరాజు ఆధ్వర్యంలో పిజియోతెరపికి సంబంధించి హై స్కూల్ లో నిర్మితమై ఉన్న రూమ్స్ లో ఒక రూమ్ ను ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో ఎమ్మెల్యే దాట్ల ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ చెల్లి సురేష్, నడింపల్లి సుబ్బరాజు, ఏంఈవో వెంకట రమణ, ఏం .వెంకటేశ్వర రావు, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.