శ్రీశ్రీశ్రీ భక్త కనక దాసు 538వ జయంతి వేడుకల్లో గద్వాల ఎమ్మెల్యే.
పయనించి సూర్యుడు తేది 9 నవంబర్ ఆదివారం జోగులమ్మ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా బోయ కిష్టన్న.
ఈరోజు గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండల పరిధిలోని చింతల కుంట, సుల్తానా పురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాసు 538జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజ నిర్వహించిన *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమెహన్ రెడ్డి కురువ కులస్తుల కురువ డోలతో ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు
సుల్తానాపురం గ్రామంలో కురువ సోదరులు ఎమ్మెల్యే గొర్రె పిల్లను బహుకరించారు ఎమ్మెల్యే గారికి గ్రామస్తులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు చింతలకుంట కురువ సంఘం నాయకులు ఎమ్మెల్యే గజమాల తో ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.
కురువ కులస్తులందరికీ భక్త కనక దాసు 538వ జయంతి శుభాకాంక్షలు కర్ణాటక ప్రాంతంలో ఉడిపి ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణుని దేవాలయంలో శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి అవకాశం కల్పించేవారు కాదు దేవాలయం వెనుక నుండి శ్రీకృష్ణుని భక్తిగా ప్రార్థించడం జరిగింది కనకదాసు ఆయన భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు వెనుక తిరిగి కనకదాసు కు దర్శనం ఇవ్వడం జరిగినది.శ్రీ కనక దాసు జయంతి సందర్భంగా గ్రామ గ్రామాలలో పండగ వాతావరణం నెలకొల్పన జరిగినది తెలంగాణ రాష్ట్రంలో గద్వాల నియోజకవర్గం లో బడుగు బలహీన వర్గాలలో అభ్యున్నతకు, అభివృద్ధికి కోసం హర్నిశలు కృషి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు,మాజీ, జెడ్పీటీసీ రాజశేఖర్, మాజీ ఎంపిపి విజయ్,సింగిల్ విండో డైరెక్టర్ రఘు కుమార్ శెట్టి, నాయకులు ఉరుకుందు, మైలగడ్డ చంద్రశేఖర్ విశ్వనాథ్ రెడ్డి, కృష్ణ రెడ్డి , నర్సింహులు, ఖాజా , వీరేష్, ఖాసీం నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
