మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు ఆగస్టు 15 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ )హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్, ఐమ్యాక్స్ సర్కిల్ ఎదురుగా, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ (అంబేద్కర్ విగ్రహం సమీపంలో) మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్,మంత్రులు వాకిటి శ్రీహరి,పొన్నం ప్రభాకర్,కొండ సురేఖ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్,ఆర్ కృష్ణయ్య, సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, దానం నాగేందర్,నవీన్ యాదవ్,మందుల సామేల్ ,మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్,ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు ,మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.