ప్రతి నీటి చుక్క విలువైనది ఆ నీరు వృధా అవుతుంది మహాప్రభో
పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన చందన షాపింగ్ మాల్ సమీపంలో మున్సిపల్ నీటి పైప్ డ్యామేజ్ కావడంతో భారీగా నీరు లీక్ అవుతోంది.రోజులుగా నీరు వృథా అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.వేసవి కాలం ప్రారంభమవుతున్న ఈ సమయంలో ప్రతి చుక్క నీరు కీలకమని ప్రజలు చెబుతున్నారు.అయినా సరే ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం ప్రజలను అసహనానికి గురిచేస్తోంది.ప్రభుత్వం నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తుండగా నేలమీద మాత్రం అమలు లేకపోవడం స్పష్టమవుతోంది.ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే నీటి కొరత మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు.సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.లీకేజీని పూర్తిగా సరిచేసి నీటి వృథాను అరికట్టాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు.
