యువత ఉపాధి కల్పనలో ముందుండాలి
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
చేగురులో టీ టైం ప్రారంభోత్సవం
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
నందిగామ మండలం చేగూరు గ్రామంలో కన్హా ఆశ్రమం రోడ్డులో నుతంగా అన్నారం మహేష్ గౌడ్ ఏర్పాటుచేసిన టీ టైం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా,స్వయం ఉపాధి మరియు వ్యాపార రంగాలలో రాణించి,ఇతరులకు ఉపాధి కల్పించాలని యాజమాన్యనికి శుభాకాంక్షలు తెలియ జేస్తు అభినందించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో చేగూర్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ మామిళ్ల విట్టల్,నాయకులు సములయ్య, మల్లేష్ గౌడ్,రవి,గుండాల శ్రీను,భాస్కర్ గౌడ్,అశోక్,రమేష్, అన్నారం నర్సిమా గౌడ్,యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
