
పయనించే సూర్యుడు న్యూస్( ఆగస్టు.24/08/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
*తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధి రాచకండ్రిగ వద్ద ఆదివారం ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి తమ బృందంతో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు.హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాహన దారులకు, లైసెన్సు లేని వాహన దారులకు అపారాధ రుసుము విధిస్తూ,ప్రతి వాహన దారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరు లైసెన్స్ ను తీసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. జరుగుతున్న రోడ్డు ప్రమాదలను దృష్టిలో పెట్టుకొని వాహనాలను సరిఅయిన మార్గంలో వాహనాలు నడుపుతూ క్షేమంగా తమ తమ గమ్యానికి సురక్షితముగా చేరుకోవాలని ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి ప్రయాణికులకు సూచించారు…