PS Telugu News
Epaper

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ – భీకర కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి

📅 06 Nov 2025 ⏱️ 12:41 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధి మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్‌లో మరో నలుగురు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధిలోని మరికెళ్ల అడవుల్లో భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈ కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.  మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం-మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. నిన్న జరిగిన ఎన్ కౌంటర్‌‌లో ముగ్గురు మృతి చెందారు.

Scroll to Top