PS Telugu News
Epaper

లానినా ప్రభావం: భారతదేశంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు తగ్గే అవకాశం

📅 11 Nov 2025 ⏱️ 3:17 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలోని అన్ని రాష్ట్రాలకు భారత వాతవారణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఈ సారి లానినా ఎఫెక్ట్‌ తీవ్రంగా ఉండబోతుందని అంచనా వేసింది వాతావరణశాఖ. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని.. దానితో పాటు తీవ్రమైన చలి వాతావారణం ఉండనున్నట్టు వాతవారణ శాఖ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాలలో హిమపాతం కురుస్తుందని.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు శీతాకాలపు చలి తీవ్రంగా ఉండనుంది తెలిపింది. రాజస్థాన్‌లోని 12 జిల్లాల్లో ఇప్పటికే 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు ఉష్ణోగ్రత పడిపోయింది. వర్షాలు, హిమపాతం, చల్లని గాలులు కురిసే అవకాశం ఉన్నందున, అనేక రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాలలో మోస్తరు వర్షాలు, హిమపాతం కురిపించే అవకాశం ఉంది. పర్వతాలలో హిమపాతం తర్వాత మైదానాలలో చల్లటి గాలులు వీస్తాయి. దీని వలన రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ వాఖ పేర్కొంది.ముఖ్యంగా రైతులు, ఉదయం ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని IMD సూచించింది. రాజస్థాన్‌లోని కొండ ప్రాంతం – సికార్ – రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అల్వార్, ఝుంఝును, ఉదయపూర్ వంటి నగరాల్లో ఈ సీజన్‌లో రాత్రి వేళ అత్యంత చలి వాతావరణం నమోదైనట్టు పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో జరిగే వాతావరణ మార్పును లానినా అంటారు. ఇది ప్రపంచ వాతావరణంలో మార్పులకు దారితీస్తుంది. ప్రతి మూడు నుంచి ఐదేళ్ల మధ్య ఒకసారి లానినా ఏర్పుడుతంది. కొన్ని సమయాల్లో వరుస సంవత్సరాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. లా నినాతో తూర్పు పసిఫిక్‌లోని నీటిని సాధారణం కంటే మరింత చల్లగా మారుతుంది. లానినాతో రుతుపవనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు కరువు పరిస్థితులకు లానినా కారణమయ్యే అవకాశం ఉందని చెబుతారు.

Scroll to Top