PS Telugu News
Epaper

“బాలయ్య ఇంపాక్ట్ ఇదే… ‘అఖండ 2’పై ఇండస్ట్రీలో జోష్ పెరిగిపోయింది!”

📅 21 Nov 2025 ⏱️ 12:58 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ డిసెంబర్ 5న విడుదల కానుంది. నేడు (నవంబర్ 21) సాయంత్రం 6 గంటలకు చిక్కబల్లాపూర్–చింతామణి బైపాస్ వద్ద ట్రైలర్ లాంచ్ గ్రాండ్‌గా జరుగుతుంది. ఈ ఈవెంట్‌కు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా రానున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఉత్తరాంధ్ర రూ. 13.50Cr, గుంటూరు రూ. 9.50Cr, ఈస్ట్ రూ. 8.25Cr, సీడెడ్ ఏకంగా రూ. 24Cr కు డీల్ క్లోజ్ అయింది. అఖండ–2 విడుదలకు ముందే భారీ బజ్ సృష్టిస్తుంది.టాలీవుడ్‌లో మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు నందమూరి బాలకృష్ణ పేరు బ్రాండ్‌గా మారింది. ఆయన స్క్రీన్‌పై కనిపించగానే థియేటర్లలో ఎనర్జీ ఏ రేంజులో పెరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సిల్వర్ స్క్రీన్‌పై తన పవర్‌ను మళ్లీ చూపేందుకు ఆయన ‘ అఖండ 2 ’ రూపంలో సిద్ధమవుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ 2 – తాండవం’ ఫస్ట్ గ్లింప్స్‌తోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రత్యేకంగా విడుదల చేసిన ప్రోమోలు, టీజర్, పాటలు అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌పై అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది.‘అఖండ 2’ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పటికే ముంబై, విశాఖ నగరాల్లో గ్రాండ్ ఈవెంట్లు నిర్వహించింది. ఈ రోజు (నవంబర్ 21) కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ చింతామణి బైపాస్ వద్ద సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ లాంచ్ వేడుకను భారీగా నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ చీఫ్‌ గెస్ట్‌గా హాజరవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలయ్య, శివన్న మధ్య ఉన్న స్నేహం, రెస్పెక్ట్‌ ఈ ఈవెంట్‌కు మరింత వన్నె తీసుకురానుంది.ఇదిలా ఉంటే, ‘అఖండ–2’కు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ నెలకొంది. థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఉత్తరాంధ్ర ఏరియా హక్కులను గాయత్రీ దేవి ఫిల్మ్స్‌ సతీష్ రూ. 13.50 కోట్లకు సొంతం చేసుకున్నారు. గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హక్కులు రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ రూ. 9.50 కోట్లకు దక్కించుకోగా, ఈస్ట్ గోదావరి హక్కులను విజయలక్ష్మి సినిమాస్ రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. కృష్ణా జిల్లాకు నాని వెంకట్ రూ. 7 కోట్లు చెల్లించగా, వెస్ట్ గోదావరి రూ. 6.5 కోట్లకు డీల్ క్లోజ్ అయింది. నెల్లూరు రైట్స్ కావలి భరత్ రూ. 4.4 కోట్లకు తీసుకున్నారు. సీడెడ్‌లో బాలయ్య క్రేజ్ భారీగా ఉండటంతో ఆ ఏరియాలో రైట్స్‌ని శోభన్ రూ. 24 కోట్లకు సొంతం చేసుకున్నారు. బాలయ్య కెరీర్లోనే ఇది హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయిన ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇక నైజాం హక్కుల విషయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందుకు వస్తున్నట్టు సమాచారం. మేకర్స్ ఈ ప్రాంతానికి రూ. 30 కోట్ల కోట్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. బోయపాటి–బాలయ్య కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన మూడు చిత్రాలు ఒకదానికొకటి బ్లాక్‌బసర్ట్ కాగా ‘అఖండ 2’పై అంతకుమించిన అంచనాలున్నాయి. మొత్తమ్మీద ‘అఖండ 2 – తాండవం’ విడుదల ముందే టాలీవుడ్‌లో భారీ చర్చకు దారి తీసింది. బాలయ్య మాస్ రేంజ్‌, బోయపాటి శ్రీను రేంజ్ మైథాలజికల్ ఎలిమెంట్స్, తమన్ మ్యూజిక్ అన్నీ కలిపి ఈ సినిమా డిసెంబర్‌లో బాక్సాఫీస్‌ వద్ద తుపాను సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Scroll to Top