కుమ్మరుల తొలి బోనం జాతరకు బయల్దేరిన కుమ్మరి సంఘం

July 16, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు జూలై 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద శ్రీ కనకాల కట్ట మైసమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న కుమ్మరుల తొలి బోనం జాతరకు షాద్నగర్ నియోజకవర్గం కుమ్మరి సంఘం అధ్యక్షులు నడి కూడ శ్రీశైలం మరియు ప్రధాన కార్యదర్శి రాయికల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో శ్రీ కనకాల కట్ట మైసమ్మ బోనాలకు బయలుదేరిన షాద్నగర్ కుమ్మరి సంఘం నేతలు మరియు మహిళలు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper